ఇప్పుడనిపిస్తుంది.. చదువు అనేది మనిషికి ఎంత అవసరమో. అందుకే రామకోటి చెప్పేది ఒక్కటే.. కూలి పనిచేసైనా, పస్తులుండైనా సరే చదువుకోవాలి అని. చదువే అన్నిటికి మూలం. బడి అంటే నా దృష్టిలో దేవాలయం అంటారు రామకోటి. చదువే మనిషి ఉన్నతికి మార్గం. చదువుకున్నవాడే నాకు ఆరాధ్యుడు.. ఆత్మీయుడు.. మహాత్ముడి స్ఫూర్తిగా హిందీభాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముగించారు రామకోటి.
స్పందించండి